తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ మే 22, శుక్రవారం నాడు ఎర్రగడ్డలోని యాదగిరి నగర్, సుల్తాన్ నగర్ బస్తీల్లో బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పేదల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఇప్పటికే 123 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 22 న ఒకేసారిగా మరో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ జిల్లాలో 22, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 05, సంగారెడ్డి జిల్లాలో 03 చొప్పున బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రి కేటిఆర్, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, హోం మంత్రి మహమూద్ అలీ, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బస్తీ దవాఖానాలను ప్రారంభించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu