మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ తీవ్రస్థాయికి చేరుకుంది. ఇటీవల రోజువారీగా పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 23, మంగళవారం ఒక్కరోజే 28699 కరోనా కేసులు, 132 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 25,33,026 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 53,589 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 13,165 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 22,47,495 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 88.73 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.12 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 2,30,641 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు మంగళవారం నాటికి మహారాష్ట్రలో 1,85,84,463 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ