తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1607 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో నవంబర్ 6, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,48,891 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనాతో మరో ఆరుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1372 కి పెరిగింది. శుక్రవారం నాడు 44,644 శాంపిల్స్ పరీక్షించగా, రాష్ట్రంలో మొత్తం పరీక్షలు సంఖ్య 45,75,797 కు చేరుకుంది.
తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 296, భద్రాద్రి కొత్తగూడెంలో 124, రంగారెడ్డి జిల్లాలో 115, మేడ్చల్ లో 113, ఖమ్మంలో 84, కరీంనగర్ లో 78, సిద్ధిపేటలో 69, నల్గొండలో 67, వరంగల్ అర్బన్ లో 48, సూర్యాపేటలో 46, నాగర్ కర్నూల్ లో 43, జగిత్యాలలో 42, సంగారెడ్డిలో 41 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (నవంబర్ 6, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 45,75,797
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 2,48,891
- కొత్తగా నమోదైన కేసులు : 1607
- నమోదైన మరణాలు : 6
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 2,27,583
- కరోనా రికవరీ రేటు: 91.43%
- యాక్టీవ్ కేసులు: 19,936
- హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉన్నవారి సంఖ్య: 17,134
- మొత్తం మరణాల సంఖ్య : 1372
- కరోనా మరణాల రేటు: 0.55%
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ