తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2381 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 24, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,81,627 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనాతో మరో 10 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1080 కి పెరిగింది. గురువారం నాడు 57,621 శాంపిల్స్ పరీక్షించగా, రాష్ట్రంలో మొత్తం పరీక్షలు సంఖ్య 27,41,836 కు చేరుకుంది.
తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 386, రంగారెడ్డి జిల్లాలో 227, మేడ్చల్ లో 193, నల్గొండలో 132, కరీంనగర్ లో 119, భద్రాద్రి కొత్తగూడెంలో 97, సిద్ధిపేటలో 86, ఖమ్మంలో 84, వరంగల్ అర్బన్ లో 83, సూర్యాపేటలో 78, రాజన్న సిరిసిల్లలో 70 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (సెప్టెంబర్ 24, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 27,41,836
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 1,81,627
- కొత్తగా నమోదైన కేసులు : 2381
- నమోదైన మరణాలు : 10
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 1,50,160
- కరోనా రికవరీ రేటు: 82.67%
- యాక్టీవ్ కేసులు: 30,387
- హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉన్నవారి సంఖ్య: 24,592
- మొత్తం మరణాల సంఖ్య : 1080
- కరోనా మరణాల రేటు: 0.59%
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu