తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2474 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 21, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,01,865 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 7 గురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 744 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.73 (< 1%) శాతంగా ఉంది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 1,768 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 78,735 కి చేరింది. ప్రస్తుతం 22,386 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 77.29 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 447, రంగారెడ్డి జిల్లాలో 201, నిజమాబాద్ లో 153, మేడ్చల్ లో 149, ఖమ్మంలో 125, వరంగల్ అర్బన్ లో 123, నల్గొండ లో 122, సిద్దిపేటలో 92, జగిత్యాలలో 91, పెద్దపల్లి లో 79, కరీంనగర్ లో 75, సంగారెడ్డిలో 72, సూర్యాపేటలో 63, కామారెడ్డిలో 61, జోగుళాంబ గద్వాల్ లో 59, మహబూబాబాద్ లో 59, మంచిర్యాలలో 53, రాజన్న సిరిసిల్లలో 52, నాగర్కర్నూల్ లో 52, మహబూబ్నగర్ లో 49, భద్రాద్రి కొత్తగూడెంలో 44 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu