తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 2478 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 3, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,35,884 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 10 మంది మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 866 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.63 (< 1%) శాతంగా ఉంది.
ఇక కరోనా నుంచి కొత్తగా 2,011 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,02,024 కి చేరింది. ప్రస్తుతం 32,994 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 75 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 267, మేడ్చల్ లో 190, రంగారెడ్డిలో 171, నల్గొండలో 135, కరీంనగర్ లో 129, ఖమ్మంలో 128, వరంగల్ అర్బన్ లో 95, సూర్యాపేటలో 87, భద్రాద్రి కొత్తగూడెంలో 86, కామారెడ్డిలో 85, నిజామాబాద్ లో 85, సిద్దిపేటలో 82, జగిత్యాలలో 79, మంచిర్యాలలో 69, పెద్దపల్లిలో 68, సంగారెడ్డిలో 67, యాదాద్రి భువనగిరిలో 57, జనగామలో 51, మహబూబాబాద్ లో 50 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu