సెప్టెంబర్ 7, సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం కానుంది. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ ఆహ్వానించారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలు సహా పలు అంశాలపై సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కరోనా పరిస్థితుల్లో సమావేశాలు జరుగుతుండడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా చర్చించనున్నారు. అదేవిధంగా ఇటీవల మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి మృతికి టిఆర్ఎస్ఎల్పీ సంతాపం తెలుపనుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu