తెలంగాణ రాష్ట్రంలో మరో 761 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో నవంబర్ 26, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,67,665 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో నలుగురు మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 1448 కి పెరిగినట్టు తెలిపారు. కాగా మరణాల రేటు 0.54 శాతంగా ఉంది.
కరోనా నుంచి కొత్తగా 702 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2,55,378 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 95.40 శాతంగా ఉంది. ఇక ప్రస్తుతం 10,839 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 136, మేడ్చల్ లో 69, రంగారెడ్డిలో 55, భద్రాద్రి కొత్తగూడెంలో 33, సూర్యాపేటలో 33, కరీంనగర్ లో 32, సిద్దిపేటలో 30, మంచిర్యాలలో 29, నల్గొండలో 28, ఖమ్మంలో 28 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ