తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కొత్తగా 608 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూలై 8, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,05,137 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 459 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,95,880 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.85 శాతంగా, మరణాల రేటు 0.51 శాతంగా ఉంది.
కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. మరోవైపు తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 329, రంగారెడ్డిలో 67, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 54, సంగారెడ్డిలో 16, ఆదిలాబాద్ లో 16, పెద్దపల్లిలో 12, ఖమ్మంలో 11, కరీంనగర్ 10, నిజామాబాదులో 10 నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 5,146 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY