తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా హైరిస్క్ గ్రూపులకు చెందిన వారికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 18, శుక్రవారం నాడు 1,73,913 మందికి మొదటి డోస్, 6171 మందికి రెండో డోస్ కలిపి మొత్తం 1,80,084 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. అలాగే శుక్రవారం రాత్రి 9 గంటల వరకు రాష్ట్రంలో లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 88,72,345 చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో 7,32,4521 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 1,54,7824 మంది లబ్ధిదారులకు రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో 0.13 శాతం వ్యాక్సిన్ వృధా జరిగినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ