తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 31న తేదీన టీఎస్ ఈసెట్-2020 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 25448 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఈసెట్-2020 ఫలితాలను ఈ రోజు విడుదల చేశారు. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. ఈసెట్ పరీక్షలో మొత్తం 97.58 శాతం మంది ఉత్తీర్ణులయినట్టు తెలిపారు. పరీక్షకు హాజరైన విద్యార్థులంతా అధికారిక వెబ్సైట్ ecet.tsche.ac.in లో ర్యాంక్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం డిప్లొమా, బీఎస్సి మాథెమాటిక్స్ విద్యార్దులకు ఈసెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఈసెట్ ర్యాంకుల ఆధారంగా బీఈ /బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండవ సంవత్సరంలోకి రెగ్యులర్ ప్రవేశాలు కల్పిస్తారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu