తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడిగా సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ నియమించబడ్డారు. ఈ మేరకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బక్కని నర్సింహులను పొలిట్ బ్యూరోలోకి తీసుకోవడంతో పాటుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించినట్టు తెలిపారు.
కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఇటీవలే తన అనుచరులతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కీలక నేతగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ పేరును పార్టీ అధ్యక్షుడిగా ఖరారు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 10వ తేదీన టీటీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE