ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికల పోలింగ్ నిర్వహించి పీఏసీఎస్ చైర్మన్లును ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) పాలకవర్గాల ఎన్నికలకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాల డైరెక్టర్ల స్థానాలకు ఉమ్మడి జిల్లాల వారీగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రతీ జిల్లాకూ వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చారు. ప్రతీ డీసీసీబీ, డీసీఎంఎస్లలో 20 మంది పాలకవర్గ డైరెక్టర్లను ఆ జిల్లాలోని పీఏసీఎస్ చైర్మన్లు ఎన్నుకుంటారు. 20 మంది డైరెక్టర్లలో 16 మందిని పీఏసీఎస్ చైర్మన్లు నుంచి, మరో నలుగురిని చేనేత సంఘాలు, ఇతర సొసైటీలకు చెందిన వారి నుంచి ఎన్నుకుంటారు.
డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల వివరాలు:
- రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ: 20-02-2020
- ఎన్నికల అధికారి నోటీసు జారీ చేసే తేదీ: 22-02-2020
- నామినేషన్ల స్వీకరణ: 25-02-2020 (ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు),
నామినేషన్ల పరిశీలన (మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు)
నామినేషన్ల ఉపసంహరణ (మధ్యాహ్నం 3:30 నుండి 5.00 వరకు) - పోలింగ్ తేదీ: 28-02-2020 (ఉదయం 08:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు)
- ఓట్ల లెక్కింపు: 28-02-2020 (పోల్ జరిగిన వెంటనే)
- ఫలితాల ప్రకటన: 28-02-2020 (లెక్కించిన వెంటనే)
- ఆఫీస్ బేరర్స్(పాలకవర్గ డైరెక్టర్లు) ఎన్నిక: 29-02-2020.
[subscribe]