తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై ఆపార్టీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. సంజయ్ అరెస్ట్ ని నిరసిస్తూ అనేక కార్యక్రమాలకు ప్లాన్ చేస్తోంది బీజేపీ పార్టీ. అయితే, వీటిపై దృష్టి పెట్టిన పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. దుబ్బాక నియోజకవర్గానికి వెళ్తోన్న రఘునందన్ రావును తూప్రాన్ టోల్ గేట్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు మెదక్ పోలీసులు.
అయితే, దీనిపై ఎమ్మెల్యే అభ్యంతరం తెలిపారు. తన నియోజక వర్గానికి వెళుతుంటే.. పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని ఈ సందర్భంగా రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా స్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. బండి సంజయ్ అరెస్ట్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజుల పాటు నిరసనలు జరపాలని బిజెపి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పోలీసులు కరోనా ఆంక్షల నేపథ్యంలో ఎలాంటి నిరసనలు, ధర్నాలు, దీక్షలు చేయకూడదని చెప్పారు. అనుమతి లేకుండా ఎవరైనా ఇలాంటివి చేస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ