తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం నాడు చార్జీషీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్లో మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్సింహ, మత్తయ్య, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, టీడీపీ నాయకుడు వేం నరేందర్రెడ్డి కుమారుడు వేం కృష్ణా కీర్తన్రెడ్డి పేర్లను నమోదు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ముందుగా ఏసీబీ ఛార్జ్షీట్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్రెడ్డిని గెలిపించేందుకు మద్దతు కోరుతూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ను నగదుతో ప్రలోభపెట్టేందుకు చూశారని, అలాగే మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ