తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఎంసెట్-2020 ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం నాడు కూకట్పల్లి జేఎన్టీయూ క్యాంపస్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు 1,19,187 మంది విద్యార్థులు హాజరుకాగా, 89,734 మంది ఉత్తీర్ణత సాధించినట్టుగా తెలిపారు. పరీక్షకు హాజరైన విద్యార్థులంతా అధికారిక వెబ్సైట్ eamcet.tsche.ac.in లో ర్యాంక్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎంసెట్ ఫలితాల విడుదల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు. మరోవైపు టీఎస్ ఎంసెట్-2020 కౌన్సెలింగ్ అక్టోబర్ 9 న ప్రారంభం కానుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu