తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం షెడ్యూల్ ను విడుదల చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల కోటా కింద హైదరాబాద్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మహబూబ్నగర్-రంగా రెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి.
హైదరాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ పదవీ కాలం 2023, మే 1తో పూర్తవనుంది. మహబూబ్నగర్-రంగా రెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కాటేపల్లి జనార్దన్ రెడ్డి పదవీకాలం 2023, మార్చి 29తో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు ఈసీ తాజాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఎన్నికల కోసం ఫిబ్రవరి 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుందని, మార్చి 13వ తేదీన పోలింగ్ నిర్వహించి, మార్చి 16న ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఈసీ వెల్లడించింది.
తెలంగాణలో ఒక స్థానిక సంస్థల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్:
- నోటిఫికేషన్ జారీ – ఫిబ్రవరి 16
- నామినేషన్లకు ఆఖరితేదీ – ఫిబ్రవరి 23
- నామినేషన్ల పరిశీలన – ఫిబ్రవరి 24
- ఉపసంహరణకు ఆఖరుతేదీ – ఫిబ్రవరి 27
- ఎన్నిక జరిగే తేదీ – మార్చి 13
- పోలింగ్ సమయం – ఉదయం 08:00 నుంచి సాయంత్రం 04:00 వరకు
- ఓట్ల లెక్కింపు – మార్చి 16.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE