శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అలాగే తదుపరి రోజు ఫిబ్రవరి 12న ఆదివారం మండలిలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ను ఖరారు చేశారు. 2021 నవంబర్లో బండ ప్రకాష్ బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలి చైర్మన్గా కొనసాగుతున్నారు. కాగా తెలంగాణ శాసన మండలిలో మొత్తం 40మంది సభ్యులు ఉండగా.. వారిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు 36 మంది ఉన్నారు. దీంతో డిప్యూటీ చైర్మన్గా ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ఎన్నిక లాంఛనమే కానుంది. అంతకుముందు గతంలో మండలి డిప్యూటీ చైర్మన్గా వ్యవహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ పదవీకాలం 2021, జూన్ 3వ తేదీతో పూర్తయింది. అయితే అప్పటినుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE