టీఆర్ఎస్ నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. ముందుగా తెలంగాణ ప్రభుత్వం మధుసూదనాచారి పేరును ప్రతిపాదిస్తూ సంబంధిత ఫైల్ ను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపించింది. ఈ ప్రతిపాదనకు గవర్నర్ శుక్రవారం ఆమోదం తెలుపుతూ మధుసూదనాచారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు.
కాగా గతంలో హుజూరాబాద్ టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా నియమించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుని గవర్నర్ కు ప్రతిపాదించింది. అయితే కౌశిక్ రెడ్డిని ఇటీవలే ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ ప్రకటించడంతో, గతంలో గవర్నర్ కు పంపిన ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. తాజాగా మధుసూదనాచారి పేరును ప్రభుత్వం ప్రతిపాదించడంతో గవర్నర్ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ