తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులు అందరికి మార్చి 8, బుధవారం నాడు స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటిస్తున్నట్టు తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రతి ఏడాది మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ఇస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్స్ కు, డిపార్మెంట్ హెడ్స్ కు, జిల్లా కలెక్టర్లకు సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE