తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, సినీ జర్నలిస్ట్, పీఆర్వో బిఏ రాజు కన్నుమూశారు. శుక్రవారం రాత్రి షుగర్ లెవెల్స్ లో హెచ్చు తగ్గులు రావడంతో పాటు గుండెపోటు రావడంతో బిఏ రాజు తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు వెల్లడించారు. బిఏ రాజు మృతితో తెలుగు చిత్రపరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. సినిమా జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఆయన దాదాపు నాలుగున్నర దశాబ్ధాలుగా సినీపరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. అగ్రకథానాయకుల దగ్గరనుంచి, వర్ధమాన నటీనటుల వరకు అందరితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. సూపర్ హిట్ అనే సినీ మ్యాగజైన్ను సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు.
అలాగే 1000 కి పైగా చిత్రాలకు బీఏ రాజు పీఆర్వోగా పనిచేశారు. పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యవరించారు. తన భార్య, ప్రముఖ మహిళ దర్శకురాలు బీ జయ దర్శకత్వంలో చంటిగాడు, లవ్లీ, వైశాఖం వంటి పలు చిత్రాలను నిర్మించారు. బిఏ రాజు మృతి పట్ల తెలుగు సినీపరిశ్రమ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, టెక్నిషియన్స్, సినీ జర్నలిస్టులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ