తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఐదుగురు సమాచార హక్కుచట్టం కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా నియమితులైన కట్టా శేఖర్రెడ్డి, ఎం.నారాయణరెడ్డి, గుగులోతు శంకర్నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, మహ్మద్ అమీర్ హుస్సేన్ లు ఫిబ్రవరి 25, మంగళవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో జరగగా, రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ ఎస్.రాజా సదారాం వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం అనంతరం ఐదుగురు కమిషనర్లు బాధ్యతలు స్వీకరించారు. అలాగే వీరు మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బుద్ధా మురళి, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
[subscribe]