హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. కరోనా వ్యాధి నుంచి ఇప్పటికే కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరించి, కరోనా సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్లాస్మా థెరపీ చేయనున్నారు. దేశంలోనే మొదటిసారిగా ఢిల్లీలో ఓ కరోనా బాధితుడు ప్లాస్మా థెరపీతో పూర్తిగా కోలుకున్నాడు. కరోనాకు ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్ మరియు మందు లేకపోవటంతో డాక్టర్లు ప్లాస్మా థెరపీ వైపు మొగ్గుచూపుతున్నారు.
మరోవైపు కరోనా వైరస్ నుంచి కోలుకున్న 32 మంది ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మంత్రి కేటీఆర్కు లేఖ రాశారు. కరోనా సోకి కోలుకున్న 32 మందిని, ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్న బాధితులకు ప్లాస్మా దానం చేయాల్సిందిగా తాను స్వయంగా కోరగా, వారు సుముఖత వ్యక్తం చేశారని, వారి వివరాలను ప్రభుత్వానికి అందచేస్తున్నాని అసదుద్దీన్ ఒవైసీ లేఖలో పేర్కొన్నారు.
Wrote to @TelanganaHealth Etela garu & @KTRTRS sharing details of 32 recovered patients who are happy to donate convalescent plasma. This is critical in helping current patients in their fight against #covid19. Respecting patient privacy, we’re not sharing their names here. pic.twitter.com/M82VrnX7ex
— Asaduddin Owaisi (@asadowaisi) April 27, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]