రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, తదితర అంశాలపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 27, సోమవారం నాడు ప్రసంగించిన సంగతి తెలిసిందే. “కరోనా వ్యాధి సోకినా వారి పట్ల అంటరానితనంగా భావించొద్దు. 80శాతం మందికి కరోనా ఉన్నట్లుగా తెలియనే తెలియడం లేదు. నాకైనా, ఎవరికైనా కరోనా సోకొచ్చు, ఎవరూ భయపడాల్సిన పనిలేదు. కరోనా వైరస్ జ్వరం లాంటిదే.. వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. మందులు వేసుకోవాలి. కరోనా ఒక భయంకరమైన రోగమనే ఆలోచనను బుర్రలోంచి తీసేద్దాం. రాబోయే రోజుల్లో మనం కరోనాతో కలిసి జీవించే పరిస్థితి ఉంటుందని అందరూ గమనించాలని” సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు. “కరోనా వైరస్ కేవలం జ్వరం మాత్రమే అని తరుచుగా చెప్తున్నా వ్యక్తి గురించి నేను ఏమి చెప్పగలను? అతని అజాగ్రత్త కారణంగానే కరోనా కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో అగ్రస్థానంలో ఉంది. కోవిడ్-19 ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా మారుతుందని ఆయన చేసిన అవివేక వ్యాఖ్యలను చూసి నిజంగా భయపడ్డాను. ఇక భగవంతుడే ఆంధ్రప్రదేశ్ను కాపాడాలని” విమర్శిస్తూ చంద్రబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
What can I say about a man who keeps repeating #Coronavirus is just a fever? It is because of his sheer carelessness that AP now tops the charts in South India. Truly appalled at his foolish comments about making #Covid-19 an integral part of everybody’s lives. God save AP! pic.twitter.com/XIpBQSROhR
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) April 27, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu