ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1200 దాటింది. ఏప్రిల్ 28, మంగళవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1259 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 5783 సాంపిల్స్ కి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా కొత్తగా 82 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా కర్నూల్ లో 40, గుంటూరు జిల్లాలో 17, కృష్ణా జిల్లాలో 13, కడపలో 7, నెల్లూరు జిల్లాలో 3, అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున మొత్తం 82 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1259 కు పెరిగింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1259 పాజిటివ్ కేసులకు గాను 258 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం 970 మంది చికిత్స పొందుతున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 27, సోమవారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 1003 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కొత్తగా 2 కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 25 మంది మృతి చెందగా, 332 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. ప్రస్తుతం 646 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 5783 సాంపిల్స్ ని పరీక్షించగా 82 మంది కోవిడ్19 పాజిటివ్ గా నమోదయ్యాయి.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1259 పాజిటివ్ కేసు లకు గాను 258 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 970#APFightsCorona pic.twitter.com/g0kHgvEGai— ArogyaAndhra (@ArogyaAndhra) April 28, 2020
Media Bulletin
Date: April 27, 2020District wise status update on #Coronavirus positive cases in Telangana. pic.twitter.com/Ke6IUlTzT5
— Minister for Health Telangana State (@TelanganaHealth) April 27, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]