జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం గడువు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ప్రధాన పార్టీలు అన్ని తమ అభ్యర్థుల గెలుపు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. దాదాపుగా అన్ని డివిజన్లలో ప్రచారం నిర్వహించి, గత ఆరేళ్ళ సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి, అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ టిఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇక ఎన్నికల ప్రచారంలో చివరిరోజైన ఆదివారంనాడు మంత్రి కేటిఆర్ 3 నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు నిర్వహించనున్నారు.
ఈ రోజు మంత్రి కేటిఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే:
- మధ్యాహ్నం 2 గంటలకు: జుమారత్బజార్ (గోషామహల్ నియోజకవర్గం)
- మధ్యాహ్నం 3 గంటలకు: పాటిగడ్డ చౌరస్తా (సనత్ నగర్ నియోజకవర్గం)
- సాయంత్రం 4 గంటలకు: శాంతినగర్ కాలనీ చౌరస్తా (సికింద్రాబాద్ నియోజకవర్గం)
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ