తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 805 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 805 కేసులతో కలిపి నవంబర్ 28, శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,69,223 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ వైరస్ వలన మరణించిన వారి సంఖ్య 1455 కి పెరిగింది.
మరోవైపు కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 2,57,278 మంది సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ కాగా, గత 24 గంటల్లోనే 948 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 10,490 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో కరోనా పరీక్షలు సంఖ్య 54 లక్షలు దాటింది. శనివారం నాడు 46,280 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 54,20,421 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 1,45,631 పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ