తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా 100 మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్ర వాహనాలను (ట్రై సైకిల్ మోటార్ బైక్స్) అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గత ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కింద మంత్రి కేటీఆర్ వ్యక్తిగతంగా 6 అంబులెన్స్లను విరాళంగా ఇచ్చారు. వీటితో కలిపి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు,పలువురు నాయకులు అందజేసిన ఆంబులెన్సుల సంఖ్య 100 కు చేరుకుందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
కాగా ఈ సంవత్సరం కూడా గిఫ్ట్ ఏ స్మైల్ కింద దివ్యాంగులకు కోసం అనుకూలమైన, ప్రత్యేకంగా తయారుచేసిన 100 ద్విచక్ర వాహనాలను వ్యక్తిగతంగా అందజేయనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. అనంతరం మంత్రి కేటిఆర్ నిర్ణయాన్ని అభినందిస్తూ, దివ్యాంగులకు ఉచితంగా వాహనాల పంపిణీలో తాము కూడా భాగస్వామ్యమవుతామని రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున స్పందించారు. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు బాల్కసుమన్, గాదరి కిషోర్ కుమార్, గువ్వల బాలరాజు, సైదిరైడ్డి, జీవన్ రెడ్డి, విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్ కుమార్ తదితరులు వాహనాలను అందజేస్తామని ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ