తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నసమయం ఆసన్నమయింది. 9 ఏళ్లుగా లక్షలాది మంది ప్రజలు ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుల కోసం ఎప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ త్వరలో ప్రజలకు శుభవార్త చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు మంజూర్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా కొత్త రేషన్ కార్డుల జారీకి చర్యలు తీసుకుంటోంది. ఈనెల 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారులను నియమించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు కొత్త కార్డుల జారీకి ఆదాయ పరిమితి ఎంత విధించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 89.98 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిపై కూడా ప్రభుత్వం సమీక్ష చేస్తోంది. కొన్ని నెలలుగా రేషన్ తీసుకోని కార్డులను తొలగించాలా..? ఉంచాలా..? అనే దానిపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE