తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల చోటుచేసుకున్న ఖమ్మంలో సామినేని సాయిగణేష్, కామారెడ్డిలో తల్లీకొడుకులు ఆత్మహత్యల ఘటనలపై సమగ్ర నివేదిక అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు. ఈ ఘటనలపై మీడియా, సోషల్ మీడియాల్లో వచ్చిన కథనాలతో పాటుగా పలువురు నేతలు సమర్పించిన వినతి పత్రాలపై స్పందిస్తూ గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరువు హత్యలు, అత్యాచార ఘటనలపై కూడా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళిసై కోరారు.
మరోవైపు రాష్ట్రంలో పలు చోట్ల మెడికల్ పీజీ సీట్లను బ్లాక్ చేస్తున్న వ్యవహారంపై కూడా గవర్నర్ తమిళిసై తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో వెంటనే దిద్దుబాటు చర్యలను ప్రారంభించి, వివరణాత్మక నివేదికను సమర్పించాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ను గవర్నర్ తమిళిసై ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ