తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మే 19, మంగళవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో జిల్లెల్ల నుండి ముస్తాబాద్ మధ్యలో రూ.2.50 కోట్లతో నిర్మించిన వంతెనను మంత్రి కేటిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, సంబంధిత అధికారులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. అలాగే ముస్తాబాద్ సెస్ నూతన భవనాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం పోతుగల్ – గండిలచ్చాపేట రోడ్డులో నూతన వంతెన, కొండాపూర్ – నారాయణపూర్ బ్రిడ్జిలను మంత్రి కేటిఆర్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత సిరిసిల్ల జిల్లా అధికారులతో సమావేశమై, పలు అభివృద్ధి కార్యక్రమాలు, తాజా పరిస్థితులపై మంత్రి కేటిఆర్ చర్చించనున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లెల్ల నుండి ముస్తాబాద్ మధ్యలో రూ.2.50 కోట్లతో నిర్మించిన వంతెనను ప్రారంభించిన మంత్రి @KTRTRS pic.twitter.com/v05nDqHPWw
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 19, 2020
MA&UD Minister @KTRTRS inaugurated the newly constructed CESS building in Mustabad mandal, Rajanna Sircilla Dist. @Collector_RSL Krishna Bhaskar was also present. pic.twitter.com/n2WxoSCo0Y
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 19, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu