హైదరాబాద్ లోటస్ పాండ్లోని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, ఆమెకు మధ్య ఘర్షణ చోటుచేసుకోగా.. షర్మిల తమపై చేయిచేసుకుందని పోలీసులు ఆరోపించారు. కాగా సోమవారం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశానికి సంబంధించి సిట్ అధికారుల బృందాన్ని కలిసి వినతి పత్రం ఇవ్వాలని షర్మిల భావించారు. ఈ క్రమంలో నేటి ఉదయం ఉదయం 10:30 గంటలకు లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయం నుంచి షర్మిల బయలుదేరుతుండగా పోలీసులు ఒక్కసారిగా పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. బయటకు వెళ్లేందుకు అనుమతిలేదని పేర్కొంటూ ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వైఎస్ షర్మిల పోలీసులను తప్పించుకుని తన కారు వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో షర్మిలకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా కారు ఎక్కే సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్పై చేయి చేసుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఒక పార్టీ అధ్యక్షురాలి పట్ల పోలీసుల తీరు సరిగా లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక దాడి ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న ఎస్ఐ, కానిస్టేబుల్పై చేయి చేసుకున్నందుకు షర్మిలపై ఐపీసీ 330, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై వైఎస్సార్టీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE