అసఫ్ జాహీ రాజవంశం యొక్క వారసుడు, 9వ నిజాంగా నవాబ్ రౌనక్ యార్ ఖాన్ను ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ మేరకు నిజాం వారసత్వ కమిటీ ‘మజ్లిస్ -ఇ-సాహెబ్జాదగన్ సొసైటీ’ గురువారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో చార్మినార్ సమీపంలోని మొఘల్పురాలోని ఆజం ఫంక్షన్హాల్ (ఖ్వాజా కా చిల్లా)లో ఆయనకు రాజవంశం యొక్క ఆచారబద్ధమైన పట్టాభిషేకం నిర్వహించారు. 1932లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ (ఏడవ నిజాం) ఆధ్వర్యంలో ఏర్పాటైన రిజిస్టర్డ్ సొసైటీ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. నవాబ్ రౌనక్ యార్ ఖాన్ను షాహీ ఇమామ్-ఇ-జమీన్ (చేతికి కట్టబడిన సాంప్రదాయ రక్ష)తో అలంకరించి, పూలతో దండలు వేయడంతో ఆచారం ప్రారంభమైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక మతాలచే గౌరవించబడే అజ్మీర్లోని ఖాజా గరీబ్ నవాజ్ పట్ల నిజాం యొక్క అనుబంధానికి చారిత్రక ప్రాముఖ్యత ఉందని ఈ సందర్భంగా కమిటీ పేర్కొంది.
ఇక అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి నిజాం కుటుంబ సభ్యులు పలువురు హాజరయ్యారు. అలాగే వీరితో పాటు ఈ కార్యక్రమంలో సాహెబ్జాదా మీర్ ముజ్తబా అలీ ఖాన్ ప్రెసిడెంట్ మజ్లిస్–ఇ–సాహెబ్జాదేగాన్ సొసైటీ , సాహెబ్జాదా మీర్ నిజాముద్దీన్ అలీ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ & స్పోక్స్ పర్సన్ మజ్లిస్–ఇ– సాహెబ్జాదేగాన్ సొసైటీ, సాహెబ్జాదా మొహమ్మద్, మజ్లిస్-ఈ-సాహెబ్జాదేగాన్ సొసైటీ జనరల్ సెక్రటరీ మొయిజుద్దీన్ ఖాన్, మజ్లిస్-ఈ-సాహెబ్జాదేగాన్ సొసైటీ సాహెబ్జాదీ బర్కత్ ఉన్నీసా బేగం, సాహెబ్జాదా సయ్యద్ ముబారక్ ఉల్లా బర్కత్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఇకపై రౌనక్ఖాన్ నేతృత్వంలో నిజాం ట్రస్ట్ కార్యక్రమాలు కొనసాగుతాయని వారు తెలిపారు. ఇక ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, కమిటీ సభ్యులు 9వ నిజాం రౌనక్ఖాన్కు ప్రత్యేక బహుమతులను అందించి అభినందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE