తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఈ స్థానంలో మొత్తం 93 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటికే 89 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ పక్రియ పూర్తయింది. దీంతో ఇప్పటికి రెండో ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి 6,930, బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 5,832, ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ కు 6,038, కాంగ్రెస్ అభ్యర్థికి 5,172 ఓట్లు లభించాయి.
ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి:
89మంది అభ్యర్థుల ఎలిమినేషన్ అనంతరం మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి 1,19,619 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 1,10,500 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ కు 59,648 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జి.చిన్నారెడ్డికి 36,726 ఓట్లు పోలయ్యాయి. సురభి వాణీదేవి సమీప బీజేపీ అభ్యర్థిపై ప్రస్తుతం 9,119 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ స్థానంలో గెలుపొందాలంటే ఏ అభ్యర్ధికైనా మొత్తం 1,68,520 ఓట్లు రావాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ