తెలంగాణలో 86 రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్, సీఎస్ సమీక్ష

Telangana CS Somesh Kumar held Review on Functioning of Residential Schools in the State, CS Somesh Kumar held Review on Functioning of Residential Schools in the State, Somesh Kumar held Review on Functioning of Residential Schools in the State, Review on Functioning of Residential Schools in the State, Review Meet on Functioning of Residential Schools in the State, Functioning of Residential Schools in the State, Residential Schools Functioning in the State, Functioning of Residential Schools, Residential Schools Functioning, Telangana Chief Secretary Somesh Kumar, Telangana CS Somesh Kumar, Chief Secretary Somesh Kumar, Somesh Kumar, Functioning of Residential Schools News, Functioning of Residential Schools Latest News, Functioning of Residential Schools Latest Updates, Functioning of Residential Schools Live Updates, Mango News, Mango News Telugu,

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 86 (బీసీ-04, ఎస్సీ-75, ఎస్టీ-7) రెసిడెన్షియల్ పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడేషన్‌ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ శుక్రవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో అన్ని సంక్షేమ శాఖల అధికారులతో సమావేశమై రాష్ట్రంలోని రెసిడెన్షియల్‌ పాఠశాలల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీల కోసం శాశ్వత స్టడీ సర్కిల్ ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని సీఎస్ సోమేశ్‌కుమార్‌ తెలియజేశారు. సీఎం ఆమోదం కొసం సమర్పించుటకుగాను అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు కాన్సెప్ట్‌ నోట్‌ను సిద్ధం చేయాలని సీఎస్ అధికారులను కోరారు. అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో పరిశుభ్రత కోసం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించడానికి, వంట సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి అహ్మద్ నదీమ్, టీడబ్ల్యూ అండ్ ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు కార్యదర్శి రోనాల్డ్ రోస్, బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ కార్యదర్శి బి.షఫివుల్లా, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 3 =