తెలంగాణలో మరికొద్ది గంటల్లో రాజెవరో.. బంటెవరో తేలిపోనుంది. ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో కాంగ్రెస్దే అధికారమని తేల్చేశాయి. మరికొన్ని పోల్స్ మాత్రం హంగ్ వచ్చే అవకాశం ఉందని తేల్చాయి. అయితే అటు కాంగ్రెస్ నేతలు మాత్రం ఇప్పటి నుంచే సంబురాలు మొదలు పెట్టారు. తెలంగాణలో అధికారం మాదేననే ధీమాతో ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా అధైర్య పడడం లేదు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సీఎం అభ్యర్థి ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. పెద్ద ఎత్తున జనాలు దీనిపై చర్చించుకుంటున్నారు. అటు కాంగ్రెస్ పార్టీలో కూడా నేతలు తానే కాబోయే సీఎం అంటే.. తానే కాబోయే సీఎం అంటూ చెప్పుకుంటున్నారు. అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా సీటు కుర్చీ కోసం తమ పార్టీలో 12 మంది పోటీ పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ పరిణామాల మధ్య అధిష్టానం ఎవరికి సీఎం కుర్చీ కట్టబెడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఎవరు సీఎం అభ్యర్థి అనే విషయంపై ఇండియా టుడే సంస్థ సర్వే చేసింది. ప్రజల అభిప్రాయాలను సేకరించింది. అయితే తెలంగాణ వ్యాప్తంగా 21 శాతం మంది జనాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని సర్వేలో తేలింది. అలాగే 22 శాతం మంది మాత్రం కాంగ్రెస్ నుంచి ఎవరు సీఎం అయినా పర్వాలేదని అనుకుంటున్నారని వెల్లడయింది. దీనిని బట్టి చూస్తుంటే.. కాంగ్రెస్ అధిష్టానం సీఎం అభ్యర్థిని ఫైనల్ చేయడం అత్యంత క్లిష్టమైన పరిణామమని అర్థమవుతోంది.
అయితే తెలంగాణలో మొదటి సీఎం దళితుడేనని గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆహామీని నెరవేర్చలేదు. ఈక్రమంలో భట్టి విక్రమార్కకు సీఎం పదవి ఇవ్వాలని కొందరు నేతలు పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. చివరికి సీఎం కుర్చీ ఎవరికి అనే విషయంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క మధ్యే గట్టి పోటీ ఉండొచ్చని విశ్లేషకులు అవుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE