తెలంగాణ రాష్ట్రంలో విజయ డెయిరీ పాల ధరలు పెంచుతున్నట్టు సంస్థ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ద్వారా సరఫరా చేయబడుతున్న విజయ తెలంగాణ పాలు ధర లీటరుకు రూ.2/-.. హోల్ మిల్క్ రూ.4/- చొప్పున పెంచింది. పెంచిన ధరలు జనవరి 01, 2022 వ తేది నుండి.. అనగా నేటి నుంచి అమలులోకి రానున్నాయని తెలిపింది. పాల ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో.. ధరలను పెంచుతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అయితే, ధరలు పెరిగిన దృష్ట్యా తమకు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ జనరల్ మేనేజర్ వి. మల్లికార్జునరావు వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ