రాష్ట్రంలో వ్యవసాయ మరియు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి వివరించడానికి, సందేహాల నివృత్తి నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం నాడు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్యాంకింగ్ మరియు మార్ట్ గేజ్ మాడ్యూల్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరాలను బ్యాంకర్లకు తెలియజేశారు. అనంతరం బ్యాంకర్లు ఈ ప్రకియను ప్రశంసిస్తూ వ్యవస్థలో మరింత పారదర్శకతను తెస్తుందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ మొత్తం ప్రక్రియలో ప్రభుత్వానికి, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖకు సహకరిస్తామని ఈ సందర్భంగా బ్యాంకర్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమీషనర్ మరియు ఇన్స్ పెక్టర్ జనరల్ శేషాద్రి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్ , లా సెక్రటరీ సంతోష్ రెడ్డి, టి.ఎస్.టి.ఎస్. మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్ రావు, ఎస్.బి.ఐ జనరల్ మేనేజర్ మరియు ఎస్.ఎల్.బి.సి కన్వీనర్ కృష్ణన్ శర్మ, ఎస్.బి.ఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ