టీడీపీతో పొత్తు.. ఆ రెండు స్థానాలు జనసేనకే..?

Alliance with TDP Those two seats belong to Jana Sena,Alliance with TDP,Those two seats belong to Jana Sena,Janasena, TDP, Pawan kalyan, Chandrababu naidu, AP Assembly elections,Mango News,Mango News Telugu,Alliance with TDP Latest News,Alliance with TDP Latest Updates,AP Assembly elections News Today,AP Assembly elections Latest Updates,AP Assembly elections Live News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
Janasena, TDP, Pawan kalyan, Chandrababu naidu, AP Assembly elections

ఏపీలో తెలుగు దేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు చిగురించిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో పరామర్శించేందుకు వెళ్లిన పవన్.. జైలు ఎదుటే పొత్తుపై క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అయితే ఆయా పార్టీలు పోటీ చేయబోయే స్థానాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. తెలంగాణలో ఫలితాలు వెలువడ్డాక.. టీడీపీ, జనసేన సమావేశం కానున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత ఆ పార్టీలు పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపాయి.

అయితే ఇంతలోనే జనసేనకు రెండు స్థానాలు కన్ఫామ్ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో దీనిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఎన్నికలకు వెళ్లేముందు అన్ని నియోజకవర్గాలపై టీడీపీ, జనసేప కలిసి సమీక్షలు  చేస్తున్నాయి. నియోజకవర్గాల టీడీపీ, జనసేనల బలం ఎంత.. బలం తక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పుంజుకోవడానికి ఏం చేయాల్సి ఉంది అనే అంశాలపై సమీక్ష చేస్తున్నాయి. అయితే ఈ సమీక్షపై ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు నియోజకవర్గాలను మినహాయించి అన్ని స్థానాల్లో సమీక్ష చేయాల్సివుందని వ్యాఖ్యానించారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం.. చీరాల నియోజక వర్గాలపై సమీక్ష చేయాల్సిన అవసరం లేదని అచ్చెన్నాయుడు అన్నారు. ఆ రెండు నియోజకవర్గాలు మినహాయించి మిగతా స్థానాలపైనే ఫోకస్ పెట్టాలని నేతలకు సూచించారు. అయితే ఈ రెండు నియోజకవర్గాలపై సమీక్ష చేయకుండా పక్కన పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయా స్థానాలను జనసేనకు కట్టబెట్టనున్నారని.. అక్కడ జనసేన జెండా ఎగరడం ఖాయమని చర్చ జరుగుతోంది. అందుకే ఆ రెండు స్థానాలపై సమీక్ష చేయకుండా పక్కన పెట్టారని ఏపీ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.

ఇకపోతే చీరాల జనసేన టికెట్‌ను ఆమంచి స్వాములు ఆశిస్తున్నారు. కొద్దిరోజులుగా నియోజకవర్గంలో జనసేన బలోపేతం కోసం స్వాములు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అటు పార్టీ అధిష్టానం కూడా స్వాములకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుంచి జనసేన తరుపున పోతిన మహేశ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత విజయవాడలో పార్టీని బలోపేతం చేసేందుకు పోతిన మహేశ్ తీవ్రంగా చమటోడ్చుతున్నారు. ఈసారి కూడా జనసేన విజయవాడ పశ్చిమ టికెట్‌ను పోతిన మహేశ్‌కే ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి ఆ రెండు స్థానాలు జనసేనకు కన్ఫార్మ్ అయ్యాయా? లేదా? అనేది త్వరలో తేలిపోనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =