సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారి అత్యాచారం, హత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉన్మాది చేతిలో హత్యకు గురైన 6 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. పవన్ కళ్యాణ్ వస్తున్న సంగతి తెలియడంతో ఆ ప్రాంతంలో అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు. దీంతో బాధిత కుటుంబం వద్దకు వెళ్లేందుకు వీలు లేకపోవడంతో వారినే కారు వద్దకు పిలిపించుకుని, మాట్లాడారు. సభ్యసమాజం తలదించుకునే రీతిలో చిన్నారిని దారుణంగా హత్యచేయడం దుర్మార్గమని అన్నారు. ఈ ఘటన తన హృదయాన్ని కలచి వేసిందన్నారు.
ఇటువంటి ఘటనలను పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను, ప్రభుత్వాన్ని కోరారు. జనసేన తరపున బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. చిన్నారి కుటుంబానికి తక్షణమే న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, వారికి ప్రభుత్వం అండగా నిలబడాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ