ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ నివాసంలో ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ సోదాలు నిర్వహించింది. బుధవారం ముంబయిలోని నివాసంతో పాటుగా లక్నోలోని కంపెనీలో మరియు సోనూసూద్ కు సంబంధించిన మరికొన్ని చోట్ల సోదాలు జరిగినట్టు తెలుస్తుంది. ఇటీవల సోనూసూద్ కంపెనీ చేసుకున్న ఓ ఒప్పందంలో పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలోనే ఈ సర్వే ఆపరేషన్ జరిగినట్టు సమాచారం. అయితే ఈ సోదాలు, ఇతర సమాచారంపై ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
దేశంలో కరోనా వెలుగులోకి వచ్చాక గతేడాది లాక్డౌన్ సమయం నుంచి తన సేవా కార్యక్రమాలతో సోనూసూద్ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. సొంత ఖర్చులతో వలస కూలీలను సొంత ప్రాంతాలకు తరలించడం, విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు దేశానికి వచ్చేందుకు సహాయం చేయడం, అంతే కాకుండా తనదృష్టికి వచ్చిన ఎన్నో అంశాలలో ప్రజలకు సహాయం చేసిన సోనూసూద్ రియల్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఈ క్రమంలో తాజాగా సోనూసూద్ ఆర్ధిక వ్యవహారాలపై సోదాలు జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సోనూసూద్ ను ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వం త్వరలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న ‘దేశ్ కే మెంటార్స్’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ