జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్, జనసేన నేతలతో భారీ కాన్వాయ్, భారీ జనసందోహం నడుమ కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకున్నారు. మార్గమధ్యంలో జనసైనికులు, వీర మహిళలు, అభిమానులు పవన్ కళ్యాణ్ కు గజమాలల వేసి, పూలు జల్లి తమ ఆనందోత్సాహాలను తెలిపారు. కొండగట్టు పర్యటనలో భాగంగా ముందుగా కొండగట్టు ఆంజనేయస్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. అనంతరం తన రాజకీయ క్షేత్ర పర్యటనల కోసం రూపొందించిన జనసేన ఎన్నికల ప్రచార వాహనం ‘వారాహి’ కి ఆలయ సన్నిధిలో శాస్త్రోక్తంగా సంప్రదాయ పూజ జరిపించనున్నారు. మంగళవారం ఉదయమే వారాహి వాహనం కొండగట్టుకు చేరుకోగా, వేద పండితుల పూజ అనంతరం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు.
మధ్యాహ్నం కొండగట్టు సమీపంలోని బృందావన్ ఫ్యామిలీ రిసార్ట్ కు చేరుకొని తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశం సందర్భంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించి పార్టీ నాయకులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంకు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ తన అనుష్టుప్ నారసింహ యాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శం)కు ధర్మపురి నుంచే శ్రీకారం చుట్టనున్నారు. అందులో భాగంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను కూడా దశల వారీగా పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. ఇక సాయంత్రం 5.30 గంటలకు ధర్మపురి నుంచి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు తిరుగుప్రయాణం కానున్నారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు, ధర్మపురి పర్యటనల నేపథ్యంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేయగా, సంబంధిత పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE