స్వర్గీయ నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం మరణించిన సంగతి తెలిసిందే. బుధవారం హైదరాబాద్లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఈ అంతిమ సంస్కారాలకు ఆమె మేనల్లుడు, టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి విదేశాల్లో ఉన్నందున అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో.. గురువారం ఆయన హైదరాబాద్లోని దివంగత ఉమామహేశ్వరి నివాసాన్ని సందర్శించారు. కాగా ఎన్టీఆర్ వెంట ఆయన తల్లి షాలిని, భార్య లక్ష్మీ ప్రణతి, సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు. కళ్యాణ్ రామ్ మరియు జూ. ఎన్టీఆర్ ఇద్దరూ ఉమామహేశ్వరి సోదరుడు, దివంగత హరికృష్ణ కుమారులు అన్న సంగతి తెలిసిందే.
ఇక పోలీసు వర్గాల సమాచారం.. ప్రకారం ఉమామహేశ్వరి జూబ్లీహిల్స్లోని తన నివాసంలోని బెడ్రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె వయస్సు 57 సంవత్సరాలు కాగా, ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె కొంతకాలంగా మానసిక ఆందోళనతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ క్రమంలో నిన్న జరిగిన ఆమె అంత్యక్రియలకు దగ్గరి బంధువు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, కళ్యాణ్ రామ్ సహా మరికొందరు బంధువులు హాజరై నివాళులర్పించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY