తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’ రెండోవ దశ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో కంటి వెలుగు వైద్య శిబిరాలలో ఇప్పటివరకు (ఫిబ్రవరి 10, శుక్రవారం) 33 లక్షల 60 వేల 301 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. అలాగే కంటి వెలుగు కార్యక్రమంలో ఫిబ్రవరి 10 నాటికీ 6 లక్షల 76 వేల 732 మందికి కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ మేరకు కంటి వెలుగు కార్యక్రమ తాజా వివరాలను ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా విడుదల చేసింది.
కంటి వెలుగు (2023, ఫిబ్రవరి 10న)
- కంటి పరీక్షలు: 2,01,435 మంది
- రీడింగ్ గ్లాసెస్ పంపిణీ: 30,777
- ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కోసం రెఫర్: 20,339
- కంటి సమస్యలు లేనివారు: 1,50,310 మంది
కంటివెలుగులో ఇప్పటివరకు (2023, ఫిబ్రవరి 10) మొత్తం వివరాలు:
- మొత్తం కంటిపరీక్షలు: 33,60,301 మంది
- మొత్తం రీడింగ్ గ్లాసెస్ పంపిణీ: 6,76,732
- మొత్తం ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కోసం రెఫర్: 4,60,775
- కంటి సమస్యలు లేనివారు: 22,22,669 మంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE