శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్ ను ఖరారు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నేడు (ఫిబ్రవరి 11) నామినేమిన్ దాఖలు చేయాల్సిందిగా బండా ప్రకాశ్ కు సూచించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలని సంబంధిత పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్ తెలిపారు.
ముందుగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు ఫిబ్రవరి 9న నోటిఫికేషన్ విడుదలయిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికకు ఫిబ్రవరి 11వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అలాగే ఫిబ్రవరి 12, ఆదివారం శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్ ను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఖరారు చేశారు. శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సభ్యులు సంఖ్య ఎక్కువగా ఉండడంతో డిప్యూటీ చైర్మన్గా ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ఎన్నిక లాంఛనమే కానుంది. కాగా గతంలో మండలి డిప్యూటీ చైర్మన్గా వ్యవహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ పదవీకాలం 2021, జూన్ 3తో పూర్తయింది. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఈ స్థానానికి తాజాగా ఎన్నిక నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE