తెలంగాణ కాంగ్రెస్ నేత కుంభం శివకుమార్ రెడ్డి అలియాస్ కే. శివకుమార్ రెడ్డిపై బెంగళూరు నగరంలోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు నమోదైంది. నారాయణ్పేట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న కుంభం శివకుమార్ రెడ్డి బెంగళూరు నగరంలోని ఓ ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ హోటల్లో ఓ మహిళపై అత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చాయి.
శివకుమార్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణ్ పేట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గతంలో హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు బెంగళూరులో కూడా అత్యాచారం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కబ్బన్ పార్క్ పోలీసులు టీ కాంగ్రెస్ నేత కే. శివకుమార్ రెడ్డి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలోని నారాయణపేట్ జిల్లా చీఫ్ శివకుమార్ రెడ్డి మీద గత ఏడాది మే నెలలో హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు అత్యాచారం ఆరోపణలపై కేసు నమోదు చేశారు. పంజాగుట్ట పోలీసులు అప్పట్లో తెలిపిన వివరాల ప్రకారం శివకుమార్ రెడ్డి 2020లో ఓ మహిళను కలిశారని తెలిసింది. పెళ్లి చేసుకుంటానని ఆమెతో శివకుమార్ రెడ్డి చెప్పారని, అయితే ఆమె ఆయన మొదటి భార్య గురించి ప్రశ్నించిందని పోలీసులు అంటున్నారు. తన భార్య తీవ్ర అనారోగ్యంతో బాదపడుతోందని, ఆమె మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకదని, ఆమెను చూసుకోవడానికి తనను పెళ్లి చేసుకుంటున్నానని శివకుమార్ రెడ్డి చెప్పారని బాధితురాలు పోలీసులకు చెప్పింది.
ఆ సందర్బంలో శివకుమార్ రెడ్డి ఆ మహిళ మెడలో పసుపుతాడు కట్టారని పోలీసులు చెబుతున్నారు. అనంతరం శివకుమార్ రెడ్డి బాధితురాలిని పంజాగుట్టలోని ఓ హోటల్కు పిలిచి అత్యాచారం చేశాడని.. ఆ మహిళ ఫొటోలు తీసి ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ ఫోటోలు బయటపెడతానని బెదిరించారని పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఇదే తరహాలో బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో శివకుమార్ రెడ్డి మీద మరోసారి అత్యాచారం చేశారని కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇలాంటి సమయంలో సొంత పార్టీ నాయకుడి మీద బెంగళూరులో రేప్ కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE