కృష్ణా, గోదావ‌రి రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్స్ ఉమ్మ‌డి స‌మావేశం ఆగస్టు 9న నిర్వహణ

Andhra-Telangana water dispute, AP-TS Water Disputes, Krishna Godavari River Management Boards, Krishna Godavari River Management Boards Meeting, Krishna Godavari River Management Boards to held Joint Meeting, Krishna Godavari River Management Boards to held Joint Meeting on August 9th, Krishna water dispute, Krishna Water Disputes Tribunal, Krishna Water Sharing Issue, Mango News, Water Dispute Between Telangana and Andhra Pradesh

ఆగస్టు 9వ తేదీన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం జరగనుంది. హైద‌రాబాద్‌ లోని జ‌ల‌సౌధ‌లో జరగనున్న ఈ సమావేశంపై కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాలకు ఇప్పటికే స‌మాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. గత కొన్నిరోజులుగా కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి, నిర్వహణపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. ఈ గెజిట్ అక్టోబరు 14 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో అత్యవసరంగా ఏర్పాటు చేస్తున్న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశంలో గెజిట్ నోటిఫికేష‌న్‌ లోని కీలక అంశాల అమ‌లు, కార్యాచ‌ర‌ణ‌, అలాగే రాష్ట్రాలు సూచించిన సవరణలుపై చ‌ర్చించే అవకాశమున్నట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 9 =