తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే టీఎస్ ఎంసెట్-2021 ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. ఎంసెట్ ప్రవేశ పరీక్ష కోసం ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీని జూన్ 10 వరకు పొడిగించినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ వెల్లడించారు.
ముందుగా షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీని (ఆలస్య రుసుము లేకుండా) మే 18గా ప్రకటించగా, అనంతరం మే 26 వరకు, ఆ తరవాత జూన్ 3 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ అమలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ, దరఖాస్తుకు ఆఖరు తేదీని తాజాగా జూన్ 10 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ