భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా కొత్తగా 1,32,364 పాజిటివ్ కేసులు నమోదవగా, 2713 మంది మరణించారు. దీంతో జూన్ 4, శుక్రవారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా బాధితుల సంఖ్య 2,85,74,350 కు, మరణాల సంఖ్య 3,40,702 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దేశంలో ఓవైపు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. గత 24 గంటల వ్యవధిలో 2,07,071 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 2,65,97,655 కు చేరుకుంది. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 93.08 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 16,35,993 (5.73%) మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ