తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అనంతరం ఆయన కుటుంబసభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా ఎమ్మెల్యే సతీమణి, కుమారులకు కూడా కరోనా పాజిటివ్ గా తేలినట్టు తెలుస్తుంది. వైద్యుల సూచనల మేరకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హోమ్ క్వారంటైన్ లోనే ఉండి చికిత్స పొందుతున్నట్టుగా సమాచారం. మరోవైపు ఆగస్టు 7, గురువారం నాటికీ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 77,513 కి చేరింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu